రాష్ట్రంలో అవినీతి నిర్మూలన చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. సీఎం ప్రకటించిన 14400 టోల్ ఫ్రీ నెంబర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. “జగన్ గారూ, అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు మీరు టోల్ ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు.
కానీ ప్రజల సొమ్ము రూ.43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా చంచల్ గూడ జైల్లో 16 నెలలు గడిపిన మీకు జైల్లో ఇచ్చిన నెంబర్ 6093 అని ట్వీట్ చేశారు. ఇదే నెంబర్ ను అవినీతిపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ గా పెడితే సందర్భోచితంగా ఉండేది. మీరు దోచేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డిగారూ” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆ విషయం పవన్ కల్యాణ్ కు ఎప్పుడో చెప్పాను: జయప్రకాష్