పేద మైనార్టీటీ విద్యార్థులకు తెలంగాణ సర్కారు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో పీజీ, పీహెచ్డీ చదువుకునే పేద మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారం వేతనాలు అందిస్తున్నదని మంత్రి తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద మైనార్టీ విద్యార్థులు మార్చి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆసక్తి గలవారు గడువు లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఈ సదావకాశాన్ని మైనార్టీటీ విద్యార్థులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.