వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. జిల్లా పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై వైసీపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా…లేదా ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా….లేక లోకేశ్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందా?!” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు ట్వీట్లో టీడీపీ పతనం ప్రారంభం అయిందని.. సెటైర్లు వేశారు. ఒక పార్టీ జెండా పీకేసే ముందు ఇలాంటి పరిణామాలు జరుగుతాయంటూ రాసుకొచ్చారు విజయసాయిరెడ్డి.
“ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు.
1) వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది.
2) శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి.
3) పోటీకి అభ్యర్థులు దొరకరు.
4) ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది.
5) ఖేల్ ఖతం. దుకాణం బంద్.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
previous post
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదు: చంద్రబాబు