ప్రముఖ దక్షిణాది హీరోయిన్ సంజనా గల్రాణి, బాలీవుడ్ నిర్మాత వందనాజైన్ల మధ్య గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం రాత్రి రిచ్మండ్టౌన్లోని ఓ స్టార్ హోటల్లో ఇరువురు గొడవ పడ్డారు. ఏకంగా మద్యం బాటిల్ను వందనాజైన్పై విసిరినట్టు తెలుస్తోంది. దీనిపై వందనా నగరంలోని కబ్బన్పార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా మధ్యవర్తులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జోక్యంతో రాజీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై శుక్రవారం సంజనా మాట్లాడుతూ వందనాజైన్తో గొడవ జరిగిందని, అది చిన్నపాటిదేనని, తమ మధ్య చాలాకాలంగా సన్నిహితం ఉందని అన్నారు. హోటల్లో గొడవ రాజీ చేసుకున్నామన్నారు. కానీ వందనాజైన్కు 200 కోట్ల ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో వందనాకు ఎటువంటి వ్యాపారాల కంపెనీలూ లేవని, కానీ రూ. 200 కోట్ల అక్రమ ఆస్తి ఉందని, ముంబైలో రూ. 20 కోట్ల విలువ చేసే బంగళా ఉందని ఆరోపించారు. బెంగళూరు బ్రిగేడ్ రోడ్డులోనూ ఆస్తులు ఉన్నాయని, ఆమె ఇల్లు కూడా అక్రమమేనని ఆరోపించారు.
next post