‘ప్రస్థానం’ లాంటి కల్ట్ క్లాసిక్ ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు దేవాకట్టా. ఎమోషన్.. కామెడీ.. రొమాన్స్ ఈ మూడింటిని తనదైన మార్క్ తో తెరపై ఆవిష్కరించడంలో దేవాకి ప్రత్యేకమైన శైలి ఉంది. నాగచైతన్య- సమంత జంటగా నటించిన ఆటోనగర్ సూర్య బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా ఆ సినిమాలో ఎమోషన్, లవ్, రొమాన్స్ ప్రతిదీ ఆకట్టుకున్నాయన్న ప్రశంసలు వచ్చాయి. ఆయనకు గత కొంతకాలంగా టైమ్ కలిసిరావడం లేదు. ప్రస్తుతం జీఎంబీ సంస్థలో ఓ సినిమాతోపాటు సాయిధరమ్తేజ్తో మరో మూవీకి ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో సాయి తేజ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో నటించనున్నాడని సమాచారం. ఇక ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు దేవా కట్టా. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నేటి నుంచి షురూ అయినట్లు తెలిపారు. షూటింగ్ కు సంబంధించిన పనులపై డిస్కస్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అండ్ టీం దిగిన దిగిన ఫొటో స్నాప్ చాట్ దేవాకట్టా ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అక్టోబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు దేవా తెలిపారు. సాయి తేజ్-దేవాకట్టా మూవీలో పలువురు ప్రముఖ నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో వెల్లడించనున్నారు.
previous post
next post