నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా “అర్జున్ సురవరం”. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు.
తనకెంతో ఇష్టమైన హీరో, ఆరాధ్య దైవం అయిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా రావడంతో ఆ ఒకానొక దశలో భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ “నేను ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎగ్టైట్మెంట్లో ఏదేదో మాట్లాడేశాడు” అని చిరంజీవి అంటుండగానే.. ఆయన చెవిలో నిఖిల్ ఏదో చెప్పారు. దీంతో చిరంజీవి నవ్వుతూ.. “కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెబుతున్నాడు. చూడండి.. ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే నన్ను అనుమానిస్తున్నాడు. వయసు మీదపడింది కదా నా పేరు మరిచిపోతాడు అనుకుంటున్నాడేమో. అతను జస్ట్ నిఖిల్ అన్నాడు. నిఖిల్ సిద్ధార్థ అని నాకు గుర్తు. ఏది కరెక్ట్. నిఖిల్ రూపంలో నాకు మరో తమ్ముడు, మరో శిష్యుడు దొరికాడని చాలా సంతోషం కలిగింది. ప్రేమించే వ్యక్తులు దొరకడం అనేది నేను సాధించే గొప్ప విజయం అని నేను ఫీలవుతాను. మనుషులను పొందడం అనేది నా క్రెడిబిలిటీ, బ్యాంక్ బ్యాలెన్స్గా ఫీలవుతాను. ఆ విధంగా నిఖిల్తో పరిచయం వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగింది అనుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి. అయితే, డబ్బులు ఎప్పుడు పంపిస్తావ్ ? అంటూ నిఖిల్కి మరో ఛలోక్తి విసిరారు చిరు. ప్రేమ రూపంలో పంపించూ అంటూ సరదాగా అన్నారు. ఎప్పుడూ చాక్లెట్ బోయ్గా లవర్ బోయ్గా ఉండే నిఖిల్.. అగ్రెసివ్గా యాక్షన్ హీరోగా తనను తాను తెర మీదికి ప్రెజెంట్ చేసుకోవడం అనేది బహుశా ఈ సినిమాతోనేనని తాను అనుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. ఈ సినిమాలో హానెస్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్టుగా నిఖిల్ నటన అద్భుతమన్నారు. నిఖిల్ పాత్ర సినిమాకు ఎంతో కీలకమన్నారు. సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పారు. మాస్ ఆడియన్స్ను అరించే విధంగా చేశాడని, ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుందన్నారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అని చెప్పారు.