హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అనంతరం అపోలో ఆసుపత్రి ఐసీయూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు.
కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సాయి తేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తవ్వడం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం ప్రార్థిస్తున్నారు.