telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రభుత్వం చెప్పిన పంటలు వేసే రైతులు నష్టపోయారు…

టీడీపీ ప్రెసిడెంట్ యల్ రమణ.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. నియంత్రిత సాగు పంటల్లో భాగంగా 40లక్షల ఎకరాల్లో వరిపంట రైతులు వేశారు. అందులో 24 లక్షల ఎకరాల్లో బీపీటీ-తెలంగాణ సోనా-జై శ్రీరామ్- HMT వంటి సన్న రకాలు సాగు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నారకాల పంటల కోత ప్రారంభమైంది కానీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. సన్నారకాలను ప్రభుత్వం కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, మిల్లర్లు కానీ ఏ ధరకు కొనుగోలు చేయాలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు రమణ పేర్కొన్నారు. కేంద్రం క్వింటా ధాన్యానికి 1888 రూపాయల మద్దతుదర ప్రకటించింది… అదే ధరకు సన్నారకలు కొనుగోలు చేస్తామంటున్నారు. ఇప్పుడు సన్నారకాల కొనుగోళ్ల పై ప్రభుత్వం స్పందనలేకపోవడం పై తెలంగాణ రైతాంగం అతితక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది అని రమణ తెలిపారు. గతంలో సన్నాలకు మిల్లర్లు 2500 వందలు పెట్టి కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. భారీ నష్టాల వల్ల రైతులు పంటనష్టానికి గురి అయ్యారు. నియంత్రిత సాగు వల్ల సన్నారకాలకు రైతు ప్రతి ఎకరానికి 20వేలు నష్టపోవాల్సి వచ్చింది అని రమణ అన్నారు. ప్రభుత్వం వెంటనే సన్నారకాల కొనుగోళ్ల పై స్పష్టమైన విధానం కార్యాచరణ ప్రకటించాలి. అలాగే ధాన్యం క్వింటా మద్దతుధరకు అదనంగా కనీసం 5వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.

Related posts