telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందే..

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ విచారం వ్య‌క్తం చేశారు. మహిళలపై కన్నేత్తి చూస్తే కఠినచర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

దుండుగుల అఘాయిత్యానికి గురై, హైదరాబాద్​ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబసభ్యులను కేటీఆర్​ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన మంత్రి.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్న మంత్రి.. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related posts