అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ఇవాళ ఉదయం మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. నాయిని ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిన్న రాత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కాగా మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారు. అయితే.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
previous post