telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భారీ వర్షాల నేపథ్యంలో బొల్లారంలో ఇల్లు నేలమట్టం…

సికింద్రాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బొల్లారంలో ఒక ఇల్లు కూలిపోయింది..గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెద్దఎత్తున ఇళ్లలోకి చేరడంతో శిధిలావస్థకు చేరుకున్న ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి..బొల్లారంలోని శివాలయం సమీపంలో ఉన్న ఓ ఇంటి గోడ తో పాటు ముందుభాగం దెబ్బతిన్నది..ఈరోజు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఇంటి ముందు భాగం మీ కూలిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు..ఆ సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..కూలిపోయిన వెంటనే కంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు..వెంటనే కంటోన్మెంట్ అధికారులు తగిన చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు..ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు..

Related posts