పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన’కు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా బుచ్చిబాబే అందించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇది జరగలేదు. ఓటీటీ ల నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా నిర్మాత మాత్రం థియేట్రికల్ విడుదలకే సిద్ధమయ్యాడు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి ఖాతాలో మరో సినిమా పడింది. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న “అలివేలుమంగ వెంకరమణ” సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేశారనే టాక్ వస్తోంది. గోపీచంద్కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుందని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా కృతి శెట్టి పేరు తెరపైకి వచ్చింది. మరీ తేజ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నాడా? లేదా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
previous post