మీడియా ఛానెల్స్కి వెళ్లి తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న సినీ నటి కరాటే కళ్యాణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్పై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి సీసీఎస్ సైబర్ క్రైమ్లో పోలీస్ కేస్ పెట్టారు. తనను సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతోందంటూ శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కరాటే కల్యాణి. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విచారణ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. గతంలో కూడా కరాటే కల్యాణి.. తనపై సోషల్ మీడియాలో వస్తోన్న అభ్యంతరకమైన పోస్ట్లు, కామెంట్స్ పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే ఎవరో ఇలా చేయిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా మరోసారి ఆమె శ్రీరెడ్డిపై కేసు పెట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.