telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న ఆర్సీబీ…

ఈరోజు ఐపీఎల్ 2020 లో మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో కోల్‌కత విజయం సాధిస్తే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానం లో ఉన్న ఆ జట్టు బెంగళూరు ను వెనక్కినెట్టి 3వ స్థానానికి చేరుకుంటుంది. అదే బెంగళూరు గెలిస్తే ముంబైని కిందకుదించి రెండవ స్థానానికి వెళ్తుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ మొదలై కావడంతో ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

కోల్‌కత : షుబ్మాన్ గిల్, టామ్ బాంటన్, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), రాహుల్ త్రిపాఠి, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

బెంగళూరు: దేవదత్ పడిక్కల్ , ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్

Related posts