telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్: కొడాలి నాని

kodali nani ycp

ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందింస్తూ టీడీపీ పై విమర్శలు గుప్పించారు.  అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించకపోవడంతో సీఎం జగన్ స్వయంగా సిట్, సీఐడీ విచారణకు ఆదేశించాల్సి వచ్చిందని మంత్రి  వివరించారు. కానీ టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డంపడుతున్నారని అన్నారు.

పార్లమెంటులోనూ ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఎదుటివారు ఎంతటి వాళ్లయినా ఢీకొట్టే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని అభివర్ణించారు.

జగన్ వంటి నేత గతంలో లేడని, ఇకముందు వస్తాడో రాడో తెలియదని అన్నారు.గతంలో నేను ఎన్టీఆర్ వద్ద పనిచేయలేకపోయాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేయలేకపోయాను. జగన్ వద్ద మంత్రివర్గంలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఒక నిజాయతీపరుడి వద్ద, అవతల కొండలు ద్ద పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నానని అన్నారు.

Related posts