telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఫైన్సల్ చేరిన ముంబై..

ఈరోజు ఐపీఎల్ 2020 లో మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ (51), ఇషాన్ కిషన్ (55) అర్ధశతకాలు చేసిన చివర్లో హార్దిక్ పాండ్య 14 బంతుల్లో 5 సిక్స్ ల సహాయంతో హార్దిక్ 37 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ఇక 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీకి మొదట్లోనే షాక్ తగిలింది. ఒక పరుగుకూడా చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 41 పరుగులకు 5 వికెట్లు చేజార్చుకుంది. కానీ తర్వాత మార్కస్ స్టోయినిస్ (65), అక్షర్ పటేల్ (42) రాణించిన తర్వాత ఎవరు ఆడకపోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయడంతో ముంబై 57 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైన్సల్స్ లోకి అడుగు పెట్టింది. ఇక ఓడిన ఢిల్లీ క్వాలిఫయర్‌ 2 లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో గెలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది.

Related posts