telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం: చంద్రబాబు

chandrababu

అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ ఇన్ని రోజులు కొనసాగిన ఉద్యమం… ఇప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కొనసాగుతూనే ఉందని తెలిపారు.

రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ వాళ్లు దేశం కోసం అండగా నిలిచినట్టుగానే… రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్న అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి’ అని ట్వీట్లు చేశారు.

Related posts