telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : మోరిస్ మెరుపులు… పంజాబ్ లక్ష్యం…?

ఐపీఎల్ లో ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో షార్జాలో జరుగుతుంది కాబట్టి బెంగళూరు భారీ పరుగులు చేస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బెంగళూరు బ్యాట్స్మెన్స్ ను పంజాబ్ బౌలర్ లి బాగా కట్టడి చేసారు. వారి కెప్టెన్ కోహ్లీ (48) ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అయితే చివర్లో క్రిస్ మోరిస్ వచ్చి మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లోనే 25 పరుగులు చేసాడు. దాంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ రెండేసి వికెట్లు క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక కింగ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 172 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో గేల్ ఆడుతున్నాడు. కాబట్టి అతను ఒకసారి మొదలు పెడితే ఈ మ్యాచ్ పంజాబ్ సునాయాసంగా గెలుస్తుంది. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts