మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే అందులో మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోని ఉన్నాయి. ఇక ముంబైలో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొత్తగా ఆసుపత్రులను ఏర్పాటు చేసినా సరిపోవడంలేదు. అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్లను కరోనా ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. స్వల్ప లక్షణాలు ఉన్న రోగులను, క్రిటికల్ కేర్ యూనిట్లు అవసరం లేని వ్యక్తులను స్టార్ హోటళ్లలో ఉంచి ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చూడాలి మరి ఆ కరోనా కెసిలి ఎప్పుడు అదుపులోకి వస్తాయి అనేది.
previous post
next post
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్