telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మస్కా కొట్టడంలో అయ్య, కొడుకులు ఆరితేరారు: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్, మునిసిపల్ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై కేసీఆర్ ఒకలా, కేటీఆర్ మరోలా వ్యాఖ్యానించినట్టున్న వార్తా పత్రికల క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేస్తూ సెటైర్లు వేశారు.

“ఏందీ డ్రామాలు? అయ్య కయ్యం అంటాడు… కొడుకు దోస్తులమంటాడు… మందికి మస్కా కొట్టడంలో ఆరితేరారు” అంటూ ట్వీట్ చేశారు. కాగా, తాను స్నేహ హస్తం అందిస్తే, ఏపీ సర్కారు కయ్యం పెట్టుకుంటోందని నిన్న కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల వినియోగంపై ఏపీతో కేసీఆర్ విభేదిస్తున్నారు. ఇదే సమయంలో తమకు జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Related posts