telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నితిన్ చెక్ సినిమా పై అనుమానాలు…

రంగ్‌దే సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు హీరో నితిన్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సన్నద్దం అవుతోంది. అయితే రంగ్‌దే సినిమా పూర్తయ్యాక నితిన్ చెక్ అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం వచ్చింది. నితిన్ చేస్తున్న చెక్ సినిమా చెస్ నేపథ్యంలో తెరకెక్కుంతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ చిత్రాన్ని పూర్తి చేయకుండానే నితిన్ మరో సినిమా అంధాధున్ రీమేక్‌ మొదలు పెట్టేశాడు. నితిన్ చెక్ సినిమాకు ఎప్పుడైనా సిద్దంగా ఉన్నా మేకర్స్ మాత్రం అంత ఆసక్తి చూపట్లేదు. దీంతో నితిన్ తన రీమేక్ సినిమాలో నటించడం మొదలు పెట్టాడు. ఈ సినిమా ఎక్స్‌ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు చేసిన పాత్రని రీమేక్‌లో తమన్నా చేస్తోంది. ఈ పాత్ర చేయడానికి తమన్నా పారితోషకం డబుల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నితిన్, కీర్తీ సురేష్‌లు జంటగా చేసిన రంగ్‌దే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది, ఆ తరువాత నెల ఫిబ్రవరీలో విడుదల కానుందని, అంతలో థియేటర్లకు ప్రేక్షకులు ఎంత స్థాయిలో వస్తున్నరనేది తేలుతుందని నిర్మాత అంటున్నారు.చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts