తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఏటా తమిళ కార్తీకమాసం పౌర్ణమి రోజు తిరుమలలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను 17, 18 తేదీల్లో ఏర్పాటు చేశారు. 17వ తేదీన వృద్ధులు, దివ్యాంగులకు 4వేల టోకెన్లు జారీచేయనున్నారు. చంటిబిడ్డ తల్లిదండ్రులను 18 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అనుమతిస్తారు.