ప్రఖ్యాత కన్నడ టీవీ నటి శోభ కారు ప్రమాదంలో మృతి చెందారు. కర్ణాటకలోని బనశంకరి గుడికి 8 మందితో కలిసి కారులో వెళుతుండగా, కారు టైర్ పేలి ట్రక్కుని ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభతో పాటు ఆమె ఫ్యామిలీకి సంబంధించి అశోక్, శ్యామల, సుకన్య, మంజులు అక్కడికక్కడే మరణించారు. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మగలు జానక్కి సీరియల్తో ఆమె కన్నడ ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఇంకా శోభా కన్నడలో పలు టీవీ సీరియల్స్లో నటించారు. శోభా రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలుసుకున్న సీరియల్ దర్శకుడు టీఎన్ సీతారామ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఆత్మకి శాంతి చేకూరాని కోరారు. పలువురు బుల్లితెర ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు.