telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముంబై విడిచి వెళ్లిపోవాలని వాట్సాప్‌లో మీమ్… ఇప్పుడు… జర్నలిస్ట్ కు కంగనా రిప్లై

Kangana

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. ఆమె వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీంతో కంగనా, సంజయ్ రౌత్ మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ తో ఈమెకు సరైన అనుబంధం లేదనే టాక్ ఉంది. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ పై కంగనా విమర్శలు చేసింది. గతంలో కంగనా ”ముంబై ఎందుకు నాకు పీవోకేలా అనిపిస్తోంది?” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సందర్భములో కంగనాకు మద్దతుగా జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ నిలిచారు. ”కంగన అభిప్రాయాన్ని ఎవరైనా గట్టిగా వ్యతిరేకించవచ్చు. అయితే బెదిరింపులు మాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ట్వీట్ చేశారు. దానికి కంగనా స్పందిస్తూ ”ముంబై విడిచి వెళ్లిపోవాలని మీరు వాట్సాప్‌లో మీమ్ పోస్టు చేశారు. కానీ ఇప్పుడు మీరు నాకు అండగా నిలబడ్డారు. నా వాక్ స్వాతంత్ర్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనిని నేను అంగీకరిస్తున్నాను. ప్రామాణికమైన ఉదారవాదుల పట్ల నాకు నిజమైన గౌరవం ఉంది. మీరు అదే మాట మీద నిలబడి నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని కంగన ట్వీట్‌ చేసింది.

Related posts