ఇటీవల హిందీ బిగ్బాస్ 15వ సీజన్ ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే షో.. బిగ్ బాస్. ఈ రియాలిటీ షోను గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ..రెట్టింపు వినోదాన్ని అందించాలని చూస్తుంటారు నిర్వాహకులు. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. 15వ సీజన్ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈసారి సల్మాన్ ఖాన్ స్థానంలో కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఓటీటీ ప్లాట్ఫామ్ ‘వూట్లో ప్రసారమవుతుంది.అయితే బిగ్బాస్ షోపై బాలీవుడ్ నటి, బిగ్ బాంబ్ రాఖీ సావంత్ హాట్ కామెంట్స్ చేసింది. ఈసారి కంటెస్టెంట్లు పరమ బోర్ తెప్పిస్తున్నారని, కంటెస్టెంట్లు ఎంటర్ టైన్ చేయకుండా.. కేవలం నిద్రపోవడానికి ఆ షో కు వెళ్తున్నారంటూ విమర్శించింది.
చాలామంది కంటెస్టెంట్లు అది చేస్తాం, ఇది చేస్తాం అని బీరాలు పలుకుతూ హౌస్లోకి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాక అందరూ బొక్క బోర్లా పడతారు. ఈసారి హౌస్లో అడుగు పెట్టిన సింగర్ స్నేహా భాసిన్ అయితే షోలో ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది రాఖీ.