telugu navyamedia
సినిమా వార్తలు

12 రోజుల సైకిల్‌ యాత్ర.. మెగాస్టార్‌ను కలిసిన అభిమాని

మెగాస్టార్‌ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ఎన్‌. ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రత్యేకంగా చాటుకున్నారు. సైకిల్‌ యాత్రతో చిరంజీవిని ఇటీవల కలిసి, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ని కూడా కలిసినందున ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి ఈ యాత్రని ప్రారంభించారాయన. 12 రోజుల్లో హైదరాబాద్‌ చేరుకున్నారు. తమపై ఇంతటి అభిమానాన్ని చూపించిన ఈశ్వరయ్యతో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కాసేపు ముచ్చటించారు. ఫొటోని బట్టి చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌ని ‘భీమ్లా నాయక్’ సెట్‌లో కలిసినట్టు అనిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చాడు ఈ అభిమాని. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్టే మేం కూడా వారు వారి కుటుంబ స‌భ్యులు బావుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. అలాగే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి క‌లిసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి.

వెంటనే ఆ వీరాభిమాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలవటం జరిగింది ఇక తన ఆనందానికి అవధులు లేదనే చెప్పాలి. తన జన్మ ధన్యమైంది అంటూ.. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని వీరిని కలిసిన ఒకరోజులో మర్చిపోయేలా చేసారు మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అంటున్నాడు ఆ వీరాభిమాని.

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా నటించినున్నారు. పవన్‌ కల్యాణ్‌.. ‘భీమ్లా నాయక్‌’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తున్నారు.

Related posts