కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలతో పాటు సెలెబ్రిటీలుకూడా సూచిస్తున్నారు. అయితే ఈ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణపై ప్రజల్లో అవగాహన నింపుతూ అద్భుతమైన పాట రాసి ఆలపించారు చంద్రబోస్. ఈ సందేశాత్మక పాటను సీపీ సజ్జనార్ సూచన మేరకు రాశానని చంద్రబోస్ తెలిపారు. ఈ పాట చూసిన మెగాస్టార్ చిరంజీవి.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ విలువైన సందేశమిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసిన చిరంజీవి కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం పోరాడుతోంది పోలీస్ శాఖ. పోలీసులందరినీ గౌరవిద్దాం, వాళ్లకు సహకరిద్దాం. చంద్రబోస్ రాసి పాడిన ఈ పాట పోలీస్ శాఖ గొప్పతనాన్ని తెలుపుతూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది అని పేర్కొన్నారు మెగాస్టార్.
The police are fighting #Corona from the frontlines to save our lives while risking their own. Let us respect and cooperate with them. A thought provoking song by @boselyricist to convey these thoughts. @cpcybd @cyberabadpolice https://t.co/zSCwVvNxZw
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 24, 2020
నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్