telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో 1,515 కొత్త కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,515 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,09,245 కి చేరింది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 13,788 కి చేరింది

ఇప్పటివరకు 19,80,407 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 15,050 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి .ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,050 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,64,06,811 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Related posts