తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.
కాగా..మహేశ్ మృతిపై జూ. ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ. ‘బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
తాజాగా ఆయన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ సైతం సోషల్ మీడియా వేదికగా భావోద్వేనికి గురయ్యారు. మహేశ్ మృతిపై ఆయన ట్వీట్.. అవును ఇది నమ్మలేకని వార్త. షాక్కు గురయ్యాను. మా స్నేహితులు, కుటుంబానికి అంత్యంత దగ్గరి వ్యక్తి, వెల్ విషర్ అయిన మహేశ్ కోనేరు ఇక లేరు. ప్రతి విషయంలో ఆయన మాకు వెన్ను దన్నుగా నిలిచారు. ఆయన మా కుటుంబానికి వెన్నుముకగా నిలిచారు. ఆయనను కొల్పోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద నష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు, స్నేహితులు శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.
ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్