telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే ..

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చిత్ర‌ప‌రిశ్ర‌మ వాళ్ల‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఈ ఆంధ్ర‌రాష్రంలో జ‌న‌గ్ మోహ‌న్‌రెడ్డి అనే ముఖ్య‌మంత్రి ఉన్నాడ‌నే  అనుకుంటున్నారా? సినిమా వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా అని ప్రశ్నించారు. నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఖండించింది. సినిమా నిర్మాతలు బలిసినవాళ్లు అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం అంటూ ఓ ప్రెస్ నోట్ వదిలారు.

కోవూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ.. మన సినిమా నిర్మాతలు బలిసినవాళ్లు అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నిజనిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాం.

మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా రెండు నుంచి ఐదు శాతం మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది.

ఈ కష్టనష్టాల బారిన పడి కొంత మంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిని బ‌ట్టి చ‌ల‌న చిత్ర నిర్మాత‌లు ఎటువంటి దారుణ ప‌రిస్థితుల‌లో ఉన్నార‌న్నది తెలుస్తోంది.

గౌరవ శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము` అని అనిఫ్రెస్‌నోట్‌ ను రిలీజ్ చేశారు.

Related posts