దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తొలి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని తన ప్రతిభను నిరూపించుకుంది. అందం, అభినయంలో తల్లికి తగ్గ కూతురని ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు జాన్వీ ఎక్కడ ఉన్నా ఆమే సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది. ఇక ఫొటోగ్రాఫర్లయితే ఆమె ఎక్కడ కన్పించినా తమ కెమెరాలకు పని చెబుతున్నారు. చివరకు జిమ్ కు వెళ్లినా కూడా… అయితే దీనంతటికి కారణం జాన్వీ డ్రెస్సింగ్ సెన్స్… తాజాగా ఈ విషయం గురించి జాన్వి సరదాగా స్పందించింది. శనివారం ఉదయం జాన్వి ఎప్పటిలాగానే జిమ్కు వెళ్ళింది. వెంటనే ఫోటోగ్రాఫర్లు తమ కెమేరాలను “క్లిక్” అన్పించారు. దీంతో జాన్వీ నవ్వుతూ “జిమ్కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు… కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.