telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలనం

ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేసి… వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్‌ ఇటీవల కాలంలో పార్టీ నిబంధనలను దాటినట్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న, మొన్న వచ్చినవారికే మంత్రి పదవులు వచ్చాయని… పార్టీలో సీనియర్‌గా ఉన్నా.. ఇంతవరకు తనకు మంత్రి పదవి రాలేదని తెలిపారు. అయినా తానేమీ బాధపడటం లేదని.. సీఎం కేసీఆర్‌కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ నమ్మకంగా పని చేస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. సీఎం కేసీఆర్‌ కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారని…సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ వల్లే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. అంతేకాదు.. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని… కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts