“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్తో పాటు పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. “సాహో” చిత్ర ఆడియో వేడుకని దేశంలోని ముఖ్య పట్టణాలలో జరపనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 17న హైదరాబాద్లో, 21న కొచ్చిన్లో, 25న బెంగళూర్లో, 27న ముంబైలో ఆడియో ఫంక్షన్ జరపనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.
యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ఈ సినిమా సంగీతం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పాటను ఒక్కొక్క సంగీత దర్శకుడు కంపోజ్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ను జిబ్రాన్ అందిస్తున్నారు. పాటల్లో ఇప్పటికే `సయ్యా సైకో..` విడుదలై ఆదరణ పొందింది. రెండో సాంగ్ `ఏ చోట నువ్వున్నా..` అనే సాంగ్ ఆగస్ట్ 2న విడుదల కానుంది. కాగా.. ఈ పాటను కంపోజ్ చేసింది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గురురంద్వా. ఈయన మాత్రం పాట విడుదల కాకుండానే పాపులర్ అయ్యారు. అయితే ఆయన వాన్కోవర్లో ప్రదర్శన చేసి బయటకు వెళుతున్న గురు రంద్వాపై ఓ పంజాబీ దాడి చేశాడు. గురు రంథ్వా కంటిపై గాయమైంది.