ప్రజా సమస్యలపై పోరాడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు స్ధానాల్లోనూ తాను ఓడిపోయినా, తన పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయినా ఆఖరిశ్వాస వరకూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పవన్కల్యాణ్ ప్రకటించారు.
జనసేన పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రణాళికతో ముందుకు వచ్చిందని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటమి నన్ను బాధించలేదన్నారు. జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయం సాధించిన మోదీ, జగన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా కోసం వై.ఎస్.జగన్ కృషి చేయాలని కోరారు. . పార్టీ కోసం పని చేయటానికి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.