telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్యలో దాడులకు ఐసిస్ ప్లాన్: ఇటలిజెన్స్

isis teeraraists

యూపీలోని అయోధ్య రామ జన్మభూమిపై ఆగస్టు 15న దాడులకు ఉగ్రసంస్థ ఐసిస్ ప్లాన్ చేస్తోందని ఇటలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల కోసం లష్కర్, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ ట్రైనింగ్ ఇచ్చిందని తెలిపింది.

ఐసిస్ ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులను బృందాలుగా భారత్ లోకి పాక్ పంపించబోతోందని చెప్పింది. ఈ బృందాలు ఒక ప్రత్యేకమైన రీతిలో జరిగేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోందని తెలిపింది. భారత్ లో అంతర్గతంగా దాడులు జరిగాయనే విధంగా ఆ దాడులు ఉండేలా స్కెచ్ వేసిందని తెలిపింది. ఈ దాడుల్లో ముఖ్యంగా వీవీఐపీలను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించింది.

Related posts