telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాబీతో చిరు కొత్త సినిమా…

Chiranjeevi

ప్రస్తుతం తెలుగు హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం సినిమాల రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయిన చిరు తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తన తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని, అంతేకాకుండా ఆ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని తెలిపారు. అయితే చిరు ప్రస్తుతం చేస్తున్న ఆచార్య ముగిసిన వెంటనే లూసిఫర్ సినిమా రీమేక్‌ను ప్రారంభించనున్నారు. లూసిఫర్ రీమేక్‌ను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే వచ్చే ఏడాదిలో బాబీ, చిరు కాంబో సినిమా పట్టాలెక్కుతుందని చిరు తెలిపారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ ఎప్పటికి విడుదల వుతుంది అనేది.

Related posts