ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లారు. ట్రీట్మెంట్ చేయించుకుంటూనే రెండుమూడు సార్లు ఇండియాకు వచ్చి వెళ్లారు ఆయన. 2019 ఫిబ్రవరిలో మొత్తం ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చారు ఇర్ఫాన్ ఖాన్. అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నకాలం మాస్క్ లోనే ఎక్కువగా కనిపించేవారు. కానీ మంగళవారం మాత్రం ముంబై ఎయిర్ పోర్టులో ఇర్ఫాన్ మాస్క్ లేకుండా కన్పించి అందరికీ షాకిచ్చారు. ఇంకేముంది ఇది చూసిన ఫోటోగ్రాఫర్స్ ఆయనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆయన పూర్తి ఆరోగ్యంతో కనబడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇర్ఫాన్ కూడా “విజయం సాధించిన ప్రక్రియలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం వలననే నేను తొందరగా కోలుకున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ఆయన త్వరలోనే హిందీ మీడియం సీక్వెల్ లో నటించనున్నారని తెలుస్తోంది.
— Irrfan (@irrfank) April 3, 2019
“మా ” ఎన్నికల్లో డబ్బుల కలకలం..