టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టుకు సెమీస్లో నిరాశ ఎదురైంది. అర్జెంటీనా జట్టుతో జరిగిన సెమీఫైనల్ సమరంలో మహిళల హాకీ టీం 1-2 తేడాతో పరాజయం చవిచూశారు. తొలి క్వార్టర్ ఆదిలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. అర్జెంటీనా ఆధిక్యాన్ని సమం చేయడానికి భారత్ విఫలయత్నం చేసింది. ఈ ఓటమి అనంతరం భారత్ మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్ పై దృష్టి నిలిపింది. ఆగస్టు 6న బ్రిటన్తో గెలిస్తే భారత్ కు కాంస్యం దక్కుతుంది.
previous post