telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ (12) నిరాశపరచగా దేవదత్ (17) కూడా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారిలో రజత్ పాటిదార్(31), గ్లెన్ మాక్స్వెల్(25) స్లర్ బోర్డును ముందుకు నడిపారు. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ఎబి డివిలియర్స్(75) అర్ధశతకంతో అదరగొట్టడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్ అందరూ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే క్యాపిటల్స్ 20 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు పోయిందా పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటారు. చూడాలి మరి ఇందులో గెలిచేది ఎవరు అనేది.

Related posts