telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

3-1 తో సిరీస్ సొంతం చేసుకున్న భారత్….

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే ఈ చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 205 పరుగులు చేయగా నిన్న ఆట సమయం ముగిసే సమయానికి 294 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన భారత్ ఈరోజు 365 పరుగులకు ఆల్ ఔట్ అయింది. పంత్(101), సుందర్(96) అద్భుతంగా రాణించడంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాడ్ పై 160 పరుగుల ఆధిక్యం సంపాందించింది. ఇక ఈరోజు తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ దెబ్బకు 135 కే ఆల్ ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే రెండు మాచ్ లలో విజయం సాధించిన భారత్ ఈ విజయంతో ఈ టెస్ట్ సిరీస్ ను 3-1 తో సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా జూన్ లో జరిగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత సాధించింది. చూడాలి మరి ఈ ఫైనల్స్ లో భారత్ ఏ విధంగా రాణిస్తుంది అనేది.

Related posts