కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. అంతలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం కాస్తా సద్దుమణిగింది. లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే ఇరుదేశాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.లడఖ్-టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్-చైనాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడంతో భారత్-చైనా సైన్యాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి.
దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న జగనే దళితద్రోహి : కే.ఎస్. జవహర్ (మాజీ మంత్రి)