బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఈ నెల 26న ఎన్నికల ప్రచారం కోసం ఓబ్రా వెళ్లారు. ఈ నేపథ్యంలో బీహార్లోని ఓబ్రా నియోజకవర్గం నుంచి ఎల్జేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ ప్రకాశ్చంద్రపై సంచలన ఆరోపణలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రచారంలో ఉండగా ఓ గ్రామంలో తనను వదిలేసిన ప్రకాశ్ చంద్ర.. తనతో కలిసి రాకుంటే అక్కడే ఒంటరిగా వదిలేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. తాను అక్కడ ప్రాణభయంతో విలవిల్లాడిపోయానని, తనపై అత్యాచారం చేసి, చంపేసి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకాశ్ చంద్ర మద్దతుదారులు తన కారును చుట్టుముట్టి కదలకుండా అడ్డుకున్నారని, ఆయన తనను ట్రాప్ చేశాడని, తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడని అమీషా ఆరోపించింది. అతడి కారణంగా తాను విమానం మిస్సయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ముంబై చేరుకున్న తర్వాత కూడా ఆయన నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్లు వచ్చాయని, ఆయన గురించి గొప్పగా మాట్లాడాలని బెదిరించారని, ప్రచారంలో ఏ జరిగిందో నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్టు చెప్పింది. ముందుగా చెప్పినట్టు కాకుండా తనతో రెండు గంటలపాటు అధికంగా ప్రచారం చేయించారని, ప్రచారంలో ప్రకాశ్ చంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తనను బ్లాక్మెయిల్ చేశాడని అమీషా చెప్పుకొచ్చింది.
previous post
next post
హీరోయిన్ వయసుపై టీవీ నటుడి కామెంట్స్… ఆమె స్పందన ఇదీ