telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది : మంత్రి హరీష్ రావు

Harish Rao TRS

సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం ఘానాపూర్ లో మంత్రి హరీష్ రావు ఉప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని..బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం లీడర్లు వస్తే బిందెలు పెట్టి నీటి కోసం ప్రశ్నించేవారు మహిళలు.. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని తెలిపారు. నైజం పాలన నుండి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారని పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారని వెల్లడించారు. బీజీపీ నాయకులు విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని..బీజేపీ వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా నాది అని హరీష్ రావు పేర్కొన్నారు.

Related posts