‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తదుపరి సినిమా ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వం లో యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డిలు నిర్మాతలుగా నిర్మించిన “సాహో” గత ఏడాది అగష్టు లో విడుదలయ్యింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం అదిరిపోయే హిట్ గా నిలిచి అదే ప్లాప్ టాక్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ కు మాత్రం షాకింగ్ టీఆర్పీ రేటింగ్ రావడం గమనార్హం. గత కొన్ని రోజుల క్రితం జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ చేసిన ఈ చిత్రానికి కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. అదే రోజున టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన “గుణ 369” చిత్రం టాప్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ లో ప్రసారం చెయ్యగా దానికి 5.9 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం.