telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు : కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోటు పొడిచారు

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధు యాష్కీ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ నియామకం ఇప్పుడైయితే ఆగిపోయిందని… రెండు పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం సరికాదన్నారు.  సోనియా గాంధీ కి తప్పుడు సమాచారం ఇస్తున్నారని… ఠాగూర్ చెప్పేదే ఫైనల్ కాదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి తనకు ఆప్తుడని.. ఆయన పీసీసీ అవ్వాలని కోరుకున్నానని తెలిపారు. పీసీసీ నియామకం సంక్లిష్టంగా మారిందని…ఇది మంచి పద్ధతి కాదు…పార్టీకి కూడా మంచిది కాదని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎన్నికల వరకు పీసీసీ నియామకం ఆగుతుందని… సాగర్ లో జానారెడ్డి ఓడిపోయింది బీసీ నాయకుడి చేతిలోనేనని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి లో పార్టీలో బీసీ లకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎన్నికల్లో నష్టం జరగదా..?… తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అధిష్టానం కి జానారెడ్డి కూడా చెప్పారన్నారు.
తనను కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భువన గిరిలో పోటీ చేయండి అని చెప్పి…ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి పోటీ చేసి తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా నియోజకవర్గం మారితే గెలిస్తానని…నియోజకవర్గాలు మారిన వాళ్ళు.. తాను ఓడిపోయానని చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. రెడ్డిలకు అరేండ్లు పదవి ఇస్తే ఏం జరిగిందని… పార్టీ కి రెడ్లతోనే అధికారం రాదన్నారు. రెడ్లు.. బీసీ లు కలిస్తేనే పార్టీకి అధికారం వస్తుందని…గతంలో ఉన్న నాయకత్వం ప్రభుత్వంతో సరిగా కొట్లాడలేదని అధిష్టానానికి తెలుసునని స్పష్టం చేశారు.

 

Related posts