telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైసీపీ ఎంపీ ప్రచారానికి ఆటంకం…

ycp ap

ప్రస్తుతం ఏపీలో వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ అన్ని ఎన్నికలో వైసీపీ నే విజయ భేరి గట్టిగ మోగించింది. ఇక ప్రస్తుతం అక్కడ అందరూ తిరుపతి ఉప ఎన్నిక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అక్కడ వైసీపీ ఎంపీ ప్రచారానికి ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కాన్వాయ్ ని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో తిరుపతి పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ప్రచార ర్యాలీ అడ్డుకున్నారు మావిల్లాపాడు తెలుగుదేశం కార్యకర్తలు. తనియాలిలో ప్రచారానికి బయలుదేరిన వెళ్తున్న క్రమంలో మధ్యలో గుమ్మళ్ళపాడు గ్రామం వద్ద తెలుగు తమ్ముళ్లు ర్యాలీని అడ్డుకుని మా వూరిలో టపాసులు కాల్చద్దు…శబ్దాలు చేయద్దు…కరోనా పరిస్థితిలో మా వూరికి రావద్దు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలుగు తమ్ముళ్ల మధ్య తోపులాట జరిగింది. దీనితో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. MLA కిలివేటి సంజీవయ్య కల్పించుకుని ఎక్కడైనా ప్రచారం చేసే హక్కు ఉందంటూ ప్రసంగం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వాదోపవాదాలు జరగడంతో గ్రామ పెద్దలు సర్దిచెప్పారు.

Related posts