telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గుంటూరు లో .. జనసేన పార్టీ కార్యాలయంపై దాడి.. సీసీ ఫ్యూటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు..

attack by unknown on janasena party office

జనసేన పార్టీ గుంటూరు కార్యాలయంపై గుర్తు తెలియని వక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడి రాత్రి సమయంలో జరగటంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకోడానికి సమయం పట్టింది. ఈ లోపే దుండగులు బీరు సీసాలతో దాడి చేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు పగిలినట్టు తెలుస్తుంది. రాత్రివేళ కావటంతో ఎవరికి ఏమి కాలేదనే తెలుస్తుంది.

ఈ దాడి ని అడ్డుకున్న సెక్యురిటి సిబ్బందిపైకి కూడా రాళ్లు విసిరారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరు దాడి చేశారో కనుక్కోవడం కుదరలేదు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు సీసీ కెమేరా విజువల్స్ చూస్తున్నారు. మరోపక్క పోలీసులు సైతం రంగంలోకి దిగి , ఆ దాడి కి పాల్పడిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. అధికారులు కూడా సీసీ టీవీలలో ఫ్యూటేజ్ పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు తెలియరావచ్చు.

Related posts