telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాదుడే బాదుడంటూ… ఆనాడు చంద్రబాబు ఛార్జీలు పెంచలేదా?- మంత్రి ఆర్కే రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. సీఎం  జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ, డీఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష‌లతో కలిసి మంత్రి రోజా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాదుడే బాదుడు అంటూ.. వ్యాట్, విద్యుత్ ఛార్జీలను ఆనాడు చంద్రబాబు పెంచలేదా అని ప్రశ్నించారు.

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని గుర్తుచేశారు.

గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్ గా అనిపించింది కాబట్టే చంద్రబాబుని దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు.సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.

1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నామ‌ని రోజా అన్నారు.

మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తోంది. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గాయన్నారు.కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కఠిన శిక్ష విధిస్తున్నారు.

 

Related posts