మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 33 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 82.06 కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 97.86, డీజిల్ రూ. 89.17 కి చేరాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13గా ఉండగా.. డీజిల్ ధర రూ. 89.47 కి చేరింది.
next post
స్టార్ హీరో వీర్యం డొనేట్… హృతిక్ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు