పండగ పూట హీరో డా.రాజశేఖర్కి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్కు రెండో సంతానం..
కాగా.. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వరదరాజన్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మొత్తం దుంఖసాగరంలో మునిగిపోయారు.